మృతుడి కుటుంబానికి పరామర్శ
చిట్యాల ప్రజా జ్యోతి సెప్టెంబర్ 22, మండల కేంద్రానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు అల్లం రవీందర్, మాజీ ఉపసర్పంచ్ అల్లం తిరుపతి ల తండ్రి అల్లం వెంకట్ నర్సు ఇటీవల మృతి చెందగా గురువారం శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి వెంట జడ్పిటిసి గొర్రె సాగర్,మండల అధ్యక్షులు ఆరేపల్లి మల్లయ్య,నాయకులు పిట్ట సురేష్, కొక్కుల సదానందం, గుండ రవీందర్, చిలుముల రమణాచారి, కటుకూరి నరేందర్ లో ఉన్నారు.