దేశం గర్వించే రీతిలో అభివృద్ధి

Submitted by Sathish Kammampati on Tue, 20/09/2022 - 11:51
Development in a way that makes the country proud
  • పల్లెలు పట్టణాలకు శోభ తెచ్చిన ఘనత కెసిఆర్ దే  
  • నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 
  • రామన్నపేట మండలంలోరూ. 2 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన

చిట్యాల సెప్టెంబర్ 19(ప్రజాజ్యోతి)నల్లగొండ జిల్లా:తెలంగాణను దేశం గర్వించే రీతిలో అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కెసిఆర్ కి దక్కుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. రామన్నపేట మండలంలోని శోభనాద్రిపురం మరియు లక్ష్మాపురం గ్రామాలల్లో 50లక్షలతో సీసీ రోడ్ కు శంకుస్థాన చేసి,శోభనాద్రి పురం లక్ష్మాపురం గ్రామాల మధ్యన1 కోటి రూపాయలతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ కార్డులను అందజేసి రామన్నపేట మార్కెట్ యార్డులో50 లక్షలతో నిర్మించిన షెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..స్వరాష్టంలో సీఎం కెసిఆర్ సారధ్యంలో కనివిని ఎరగనిరీతిలో పట్టణాలు గ్రామాలు అభివృద్ధి జరిగిందన్నారు సబ్బండ వర్గాల సంక్షేమమే దెయ్యంగా పనిచేస్తున్న సీఎం కెసిఆర్ కు అండగా నిలువాల్సిన అవసరం ఉందన్నారు ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్టాన్ని చిన్నాభిన్నం చేసేందుకు బీజేపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.