కల్లుగీత వృత్తి దారులకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలి

Submitted by Sathish Kammampati on Tue, 20/09/2022 - 16:29
5000 pension should be given to stone quarry workers

చిట్యాల సెప్టెంబర్ 20(ప్రజాజ్యోతి).. కల్లు గీత వృత్తి చేసే వారందరికీ వయస్సుతో నిమిత్తం లేకుండా పెన్షన్ ఐదు వేలు ఇవ్వాలని ఆ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పామనుగుల్ల అచ్చాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.చిట్యాల మండలం వనిపాకల గ్రామంలో మంగళవారం నాడు సంఘం సమావేశం జరిపి మహా సభల కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా అచ్చాలు మాట్లాడుతూ ఈ నెల 26 వ తేదీ న చండూరు లో జరుగుతున్న కల్లు గీత కార్మిక సంఘం నల్లగొండ జిల్లా ద్వితీయ మహాసభలు జయప్రధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్ష కార్యదర్శి లు మామిడి హన్మంతు,గునగంటి క్రిష్ణయ్య,మండల నాయకులు బూరుగు శీను,స్వామి,శ్రీధర్,భూపతి వెంకన్న,గుడుగుంట్ల నాగయ్య,మాద సత్యనారాయణ,గునగంటి యాదయ్య,మల్లేషం,కట్టగూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.