పోంచపల్లి

ఉచిత టైలరింగ్ కంప్యూటర్ శిక్షణా తరగతులు

Submitted by krishna swamy on Tue, 27/09/2022 - 13:26

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజా జ్యోతి).//.. డిజిటల్ ఇండియా ప్రదాన మంత్రి గ్రామీన  డిజిటల్ సాక్సరత్  అబియన్ పథకంలో బాగంగా యదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోఉచిత కుట్టుమిషన్  మరియు కంప్యూటర్ శిక్షణా కేంద్రంను ఉడిత గూృప్ అప్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ చేగురి రామణవాసు  ప్రారంబించారు. ఈ సందర్భంగా అంతకు ముందు టైలరింగ్ లో శిక్షణా పొందిన 30 మంది మహిళకూ శిక్షణా ద్రువ పత్రాలను భుాదాన్ పోచంపల్లి టూరిజం పార్కు లో అందజేశారు.  ఈ సంధార్బంగా సంస్థ చైర్మెన్ బసాని అలివేలు జనార్ధన్  మాట్లాడుతూ మహిళలు ఈ శిక్షణా పొందడం  ద్వారా స్వయం ఉపాధి పోంధవచ్చు  అని  తెలిపారు.

ఎమ్మెల్యే ఫైళ్ల సమక్షంలో మెహర్ నగర్ యువత చేరిక

Submitted by krishna swamy on Mon, 26/09/2022 - 13:19

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి).,.//.. మండలంలోని మెహర్ నగర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు సంబంధించిన 20 మంది యువకులు గ్రామ శాఖ అధ్యక్షులు రాసునూరి లింగ స్వామి  ఆధ్వర్యంలో  ఆదివారం రోజున స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో పలువురు చేరడం జరిగింది.  చేరిన వారిలో ఏర్పుల వంశీ బూరుగు వంశీ సిద్ధగోని వెంకటేష్ చెక్క వినయ్ ఆకుల శివ ప్రసాద్ మూటపురం రాకేష్ యంజాల సతీష్ చెక్క రామ్ ఆకుల నాని రాసనూరి మల్లేష్ ఏర్పుల నాని ఏర్పుల సిద్దు చెక్క జంగయ్య చెక్క మధు కళ్లెం శరత్ సిద్ధ గొని  నవీన్ తదితరులు ఉన్నారు.

మృతునికి జె.వై.జి ఫౌండేషన్ సాయం

Submitted by krishna swamy on Mon, 26/09/2022 - 13:09

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 25 (ప్రజా జ్యోతి).///.. మృతుని కుటుంబానికి పది వేల సాయం అందించారు. వివరాలోకి వెళితే భువనగిరి మండలంలోని కేసారం గ్రామానికి చెందిన కాశపాక నరేష్ ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి ఇటీవల మరణించారు.  ఈ విషయం తెలుసుకున్న మనసున్న మహారాజు జె.వై.జి ఫౌండేషన్ అధినేత తెరాస నాయకులు జడల యశిల్ గౌడ్ ఫౌండేషన్ నుంచి వారి కుటుంబ సభ్యులకు 10,000 ఆర్థిక సాయం అందజేశారు.

ప్రజా సమస్యలు పరిష్కరించాలి వార్డ్ సమస్యలపై కమిషనర్కు వినతి

Submitted by krishna swamy on Wed, 21/09/2022 - 15:50

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి).../  ప్రజా సమస్యలను పరిష్కరించాలని అని పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ బండారు నరసింహ అన్నారు.తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక భూదాన్ పోచంపల్లి మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని 8వ వార్డు రాజీవ్ నగర్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య త్రాగడానికి మంచినీరు సమస్య  ఇల్లు కట్టుకున్న వారికి ఇంటి నెంబర్ సమస్యలపై పోచంపల్లి మున్సిపల్ కమిషనర్ భాస్కర్ రెడ్డికి రాజీవ్ నగర్ ప్రజలతో కలిసి వినతి పత్రం అందజేశారు.

సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

Submitted by krishna swamy on Tue, 20/09/2022 - 14:48

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి) ,,/ మున్సిపాలిటీ పరిధిలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ బాధితులు 12వ వార్డుకు చెందిన ఈపూరి మహేష్ 24,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కౌన్సిలర్ దేవరాయ కుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ కార్యదర్శి సీత శ్రవణ్ కుమార్, పగడాల పాండు, ఈపూరి బాలయ్య, చిట్టిపోలు శంకర్, చెర్కు భాను ప్రకాష్ గౌడ్, ఈపూరి దానయ్య, ఈపూరి వెంకటేష్  తదితరులు పాల్గొన్నారు.

ఇంద్రియాలలో సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ

Submitted by krishna swamy on Tue, 20/09/2022 - 14:45

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 20 (ప్రజా జ్యోతి),,. మండలంలోని ఇంద్రియాల గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న సీఎం రిలీఫ్ పండ్ స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో బాధితులు గర్సె సరోజ 36000 జినుక జయమ్మ 6000 రూపాయలు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను ఎంపీటీసీ మొగిలిపాక యాదగిరి రైతు సంఘము అధ్యక్షులు గర్సె జంగయ్య మాజి మార్కెట్ డైరక్టర్ నోముల మాధవరెడ్డి తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు పెద్దిరెడ్డి యాదగిరి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారం మరువలేనిది -ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్

Submitted by krishna swamy on Tue, 20/09/2022 - 10:36

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి)../ ప్రజా సేవ కోసం నిత్యం పరితపించేఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి  సహకారం మరువలేనిది అని ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో బిబినగర్ మండలంలోని శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొల్లెగూడం పి.ఎస్, మగ్ధుoపల్లి పి.ఎస్, మగ్ధుoపల్లి జడ్పీహెచ్ఎస్ రావిపాహడ్ పి.ఎస్ మరియు మాదారం పి.ఎస్లలో  అల్పాహార పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాగిజావను పిల్లలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్.