బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నాంపల్లి సర్పంచ్ కుంభం విజయకృష్ణారెడ్డి
నాంపల్లి, సెప్టెంబర్27 (ప్రజాజ్యోతి): మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణలో స్థానిక సర్పంచి కుంభం విజయ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అధిక సంఖ్యలో ఆడపడుచులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న చీరలను తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, స్థానిక ఉపసర్పంచి ఎస్కే అస్రాభి బేగం చాంద్ పాషా, గ్రామపంచాయతీ సెక్రటరీ ఎండి సత్తార్, వార్డ్ మెంబర్లు పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, గాదేపాక వేలాద్రి, పంగ కొండయ్య, మహాత్మ, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.