"ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులన్నీ వచ్చేవారం నాటికి పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలి" --- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు
మహబూబ్ నగర్, సెప్టెంబర్ 19 (ప్రజాజ్యోతి ప్రతినిధి) : ప్రజావాని కార్యక్రమంలో భాగంగా సోమవారం రెవెన్యూ సమావేశం మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ,రెవెన్యూ ఆదనపు కలెక్టర్ కె. సీతారామారావులు జిల్లా అధికారులతో పాటు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజావాణికి హాజరైన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు మాట్లాడుతూ జిల్లా అధికారులు, మండల స్థాయి ఆధికారులు ప్రజావాణి ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చేవారం నాటికి ఫిర్యాదులేవి పెండింగ్ లో లేకుండా చూసుకోవాలని చెప్పారు.