అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
నడిగూడెం, సెప్టెంబర్ 19, ప్రజా జ్యోతి: మండల కేంద్రం లోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్యహించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్, జిల్లా రైతు సంఘం సహాయ కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ మాట్లాడుతూ అర్హులందరికీ ఇల్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరారు.మండలంలోని అన్ని గ్రామాలలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజల సమస్యల మీద సర్వే చేసి సమస్యలు గుర్తించినట్లు తెలిపారు.