బాధిత కుటుంబాన్ని పరామర్శ
అడ్డగూడూర్ సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి ).అడ్డగూడూరు మండలం లక్ష్మి దేవి కాల్వ గ్రామంలో గల సర్పంచ్ పనుమటి అంజయ్య గారి మాతృమూర్తి పనుమటి నాంచారమ్మ అనారోగ్యం తో మరణించడం జరిగింది. వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ సాయి హాస్పిటల్ ఎండి ఆలేటి శ్రీనివాస్ గౌడ్ మరియు బాలెంల సైదులు ఈ కార్యక్రమంలో రవి బండి మధు బండి నాగరాజు అబ్బులు ,బాలెంల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు