Telangana

నూతన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ నగదు అందజెత

Submitted by Ramesh Peddarapu on Wed, 14/09/2022 - 18:27

పాలక వీడు,సెప్టెంబర్14(ప్రజా జ్యోతి): ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మం చ్ది కొత్త లబ్ది దారులకు సి ఎం. కె సి అర్ ఆసరా పెన్షన్ పథకం అమలు చేయగా. పాలకీడు మండలం లో మొత్తం 808 మందికి లబ్ది చేకూరింది. కాగా మండల పరిధిలోని గుండెబోయిన గూడెం గ్రామంలో 14 మందికి రూ.రెండు వెయిల పదహార్లు .మండల తెరాసా పార్టీ అధ్యక్షుడు కిష్టపాటీ అంజిరెడ్డి చేతులమీదుగా అందించారు.లబ్ది దారులు హర్షం వ్యక్తం చేశారు.

సంపూర్ణ ఆరోగ్యంకు రాగిజావ మేలు ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్

Submitted by krishna swamy on Wed, 14/09/2022 - 18:07

బిబినగర్, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి) సంపూర్ణ ఆరోగ్యంకు రాగిజావ ఎంతో మేలు చేస్తోంది అని ప్రతీ ఒక్కరూ తప్పకుండా సేవించాలి అని బిబినగర్ ఎంపీపీ యర్కల సుధాకర్  అన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో శ్రీ సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో బిబినగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి యుపిఎస్, చిన్నరావలపల్లి పీఎస్, చిన్నరావులపల్లి జడ్పీహెచ్ఎస్ భట్టుగూడెం పీఎస్, భట్టుగూడెం జడ్పీహెచ్ఎస్ లలో  అల్పాహార పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాగిజావను పిల్లలకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన  ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్.  

ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

Submitted by sridhar on Wed, 14/09/2022 - 17:59
  • ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.

 వరంగల్ సెప్టెంబర్14 ప్రజాజ్యోతి ; ముఖ్యమంత్రి కేసీఆర్  ఆదేశానుసారం సెప్టెంబర్ 16,17,18 తేదీలలో మూడు రోజులపాటు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు..అందుకు సంబందించి దేశాయిపేటలోని సీకేఎం కళాశాలలో చేపడుతున్న ఏర్పాట్లను కలెక్టర్ గోపి,అదికారులు,పోలీస్ అదికారులతో కలిసి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పరిశీలించారు..వివిద శాఖల సమన్వయంతో అత్యంత వైభవంగా వేడుక నిర్వహించేలా ఏర్పాట్లు చేయలని అదికారులకు సూచించారు.

భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చీర ఐలయ్యకు సన్మానం

Submitted by krishna swamy on Wed, 14/09/2022 - 17:56

బిబినగర్, సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి)  భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎన్నికయిన చీర ఐలయ్యను ఘనంగా సన్మానించిన బీబీనగర్ మండలం వైస్ ఎంపీపీ వాకిటి గణేశ్ రెడ్డీ గ్రామ సర్పంచ్ కడెం లత రాజేష్ బాబు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ప్రజల మేలు కోసం నిరంతరం కృషి చేసే ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి అని అలాంటి మహా నేతకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని కోరారు. అలాగే సన్మానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగా కృష్ణవేణి గోపాల్ గౌడ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.