అచ్చంపేట సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి).//..అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దేశ నాయక్ ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గిరిజనుల కు రిజర్వేషన్ జీవో అమలు చేస్తానని ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసులు అరెస్టు చేసి నిర్బంధించారని వారు పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారం రోజుల్లో రిజర్వేషన్ జీవో తీసుకొస్తానని చెప్పిన మాట తప్పారని ఎందుకు నిరసనగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా ముందస్తుగానే పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ తరలించారని వారు తెలిపారు గిరిజన నాయకులను అరెస్టు చేయడాన్ని రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఖండించాలని వారు తెలిపారు అరెస్టు అయిన వారిలో గిరిజన నాయకులు వంశీ నాయక్ శ్రీ రామ్ నాయక్ రవి నాయక్ శ్రీను నాయక్ తదితరులు ఉన్నారు.ఫోటో రైట్ అప్పోలీసులు అరెస్ట్ చేసిన నాయకులు.
- 1 view