నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ గుర్తింపు కార్డును విడుదల చేసిన న్యాయవాది
గద్వాల: ప్రజా జ్యోతి ప్రతినిధి:- నేషనల్ క్రైమ్ ఇన్ఫర్మేషన్ బ్యూరోగా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన కాశపోగు జాన్ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన గుర్తింపు కార్డును మంగళవారం న్యాయవాది సురేష్ మహరాజ్ ఆవిష్కరించి అందజేశారు. ఈ సందర్భంగా జాన్ ని పూలమాల శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సుగంధర్ నాథ్, తిరుమల్, ఖాజావలి, కృష్ణ, లవకుశ, రాజు తదితరులు పాల్గొన్నారు.