మహబూబాబాద్ బ్యూరో సెప్టెంబర్ 30 (ప్రజా జ్యోతి): ఇల్లందు నియోజకవర్గ గార్ల మండల మర్రిగూడెం గ్రామ పంచాయతి,తిర్ల పురం పాత తండా కు చెందిన గార్ల మాజీ జడ్పీటీసీ మాలోత్ తేజ్యా నాయక్ ఇటీవలే మృతిచెందగా మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఇదే తండాకు చెందిన భూక్య జాముకు ఇటీవలె మృతి చెందగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపి,ఆర్ధిక సహాయం చేశారు. వారి వెంట ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళ్ సింగ్ నాయక్,మండల అధ్యక్షులు దానియకుల రామారావు,రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి అంబాల శివకుమార్,సీతరాం రెడ్డి,జె లచ్చిరాం,వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ గౌడ్,రావూరి వెంకట్రామయ్య,బయ్యారం ఎంపీటీసీ మోహన్ జీ,వెంకట లాల్,సంషాద్ బేగం,పృథివీరాజ్,జవహర్,గంగ తదితరులు ఉన్నారు.
- 1 view