వ్యాసరచన చిత్రలేఖన విజేతలకు బహుమతులు

Submitted by bathula radhakrishna on Thu, 13/10/2022 - 17:52
Yellandu

సింగరేణి సంస్థ నిర్వహిస్తున్న అజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సింగరేణి పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో విజేతలకు గురువారం ఏరియా జియం ఎం.షాలేము రాజు బహుమతులను అందజేశారు.ఈసందర్భంగా జియం మాట్లాడుతూ సింగరేణి పాఠశాలలో స్వచ్చమైన త్రాగు నీటి వినియోగం,సంరక్షణ పద్ధతులు,స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో గాంధీజీ పాత్ర అనే అంశాలపై  విద్యార్థులకు వ్యాసరచన,చిత్రలేఖనం పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు.విద్యార్ధులు చదువుతోపాటు వ్యాసరచన, చిత్రలేఖనలో ప్రావీణ్యత సంపాదించాలని ఇలాంటి పోటీల్లో పాల్గొని తమ లోని నైపుణ్యతను పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏజిఎం(ఐఇడి) యం.గిరిధరరావు, అధికారుల సంఘం బాధ్యులు పసుల.రమేష్, ప్రధానోపాధ్యాయులు తిప్పరి.వెంకటేశ్వర్లు, గుర్తింపు సంఘ ఉపాధ్యక్షులు ఎస్.రంగనాధ్, ఉపాధ్యాయులు ఎ.శ్రీనివాసరావు, జి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags