పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 14 : భారత దేశ మొట్ట మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా సోమవారం కొడకండ్ల మండల కేంద్రం ఎస్సీ కాలనిలోని ప్రాధమిక పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలువురు విద్యార్థులు ఆకర్షణీయమైన దుస్తులు ధరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నెహ్రు వేషధారణలో ఎ.అమ్జత్, ఎదపై ఎర్రటి గులాబీలు ధరించి తెల్లటి టోపితో పాల్గొని ఆకర్షణ గా నిలిచాడు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దొర్ణం ప్రభాకర్ మాట్లాడుతూ చాచా నెహ్రు గొప్ప నాయకుడని పిల్లలను ప్రేమించి ఆభిమానించే మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. అనంతరం విద్యార్థులకు ఆటలు, పాటల పోటీలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుసుమ రాజు ,కవిత ,భవానీ పాల్గొన్నారు.