వాహన దారులు నియమ నిబంధనలు పాటించాలి

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 10:06
 Motorists must follow the rules

హుజూర్ నగర్ సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి)./...హుజూర్ నగర్ పట్టణంలో సిఐ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు 40 మంది సిబ్బందితో  కలిసి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలను, డ్రంక్ అండ్ డ్రైవ్, పెండింగ్ చలానాలు ఉన్న వాహనదారులను ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సి ఐ రామలింగారెడ్డి మాట్లాడుతూ వాహన దారులు నియమ నిబంధనలు పాటించాలనీ ప్రతిఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తోపాటు వాహనానికి నంబర్ ప్లేట్ల కలిగి ఉండాలని అన్నారు.మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తారని తెలిపారు.ఈ తనిఖీల్లో నిబంధనలు అతిక్రమించిన వారిపై 4 డిడి లు,పది టౌన్ న్యూసెన్స్ ఆక్ట్స్,ఓపెన్ ఏరియా బుకింగ్ నాలుగు కేసులు నమోదు చేశారాని తెలిపారు.ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.