పార్టీ బలోపేతానికి కృషి చేస్తా గూడూరు మండల యూత్ నూతన అధ్యక్షుడు మధు
గూడూరు అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి): కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అన్ని విధాలా కృషి చేస్తానని గూడూరు మండలం నూతనంగా ఎన్నికైన యూత్ అధ్యక్షుడు మధు అన్నారు. గూడూరు మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన బొల్లికొండ మధును రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కంకర అయ్యప్ప రెడ్డి నియమించినట్లు తెలిపారు.