పాలకుర్తి / కొడకండ్ల ( ప్రజాజ్యోతి) నవంబర్ 17 : కొడకండ్ల మండలంలోని పలు అనారోగ్య బాధిత కుటుంబాలను డిసిసిబి వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్ రెడ్డి గురువారం పరామర్శించారు. మండల రైతు బంధు అద్యక్షుడు దీకొండ వెంకటేశ్వరరావు ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకోగా విషయం తెలుసుకుని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సిందె రామోజీ తో కలిసి మొoడ్రాయి గ్రామంలోని ఆయన నివాసానికి వెళ్ళి పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన గ్రామ రైతుబంధు అధ్యక్షుడు గార్లపాటి ఉపేందర్ రెడ్డి తల్లి ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. మండల కేంద్రానికి చెందిన వ్యాపారి దామర సతీష్ కు శస్త్ర చికిత్స జరుగగా ఆయనను వారి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు పసునూరి మధుసూదన్, సీనియర్ నాయకుడు, ఏఎంసి డైరెక్టర్ కుందూరు అమరేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మసురం వెంకట నారాయణ, పట్టణ ఉప సర్పంచ్ బోయిని రమేష్, సీనియర్ నాయకుడు కటారి కృష్ణమూర్తి,టిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు సతీష్,నాయకులు ,సతిష్ తదితరులు పాల్గొన్నారు.