ఇల్లందులో పర్యటించిన జడ్పీ ఛైర్మన్

Submitted by bathula radhakrishna on Fri, 07/10/2022 - 16:49
Yellandu

ఇల్లందులో జడ్పీ ఛైర్మన్ కోరం కనకయ్య శుక్రవారం పర్యటించారు. పట్టణానికి చెందిన ప్రముఖ వస్త్ర బాలకృష్ణ ఖండేల్ వాల్ సోదరి విమలాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.మండల పరిధిలోని చల్ల సముద్రం గ్రామ పంచాయతీకి చెందిన సోల్తి ఐలయ్య గౌడ్ కుమార్తె భార్గవ శ్రీ ఓనీల వేడుకకు హాజరై ఆశీర్వదించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ తాటి చుక్కమ్మ,ఉప సర్పంచ్ కుర్ర అరుణ, ఎంపీటీసీ మండల రాము,నాయకులు మడుగు సాంబమూర్తి,చిల్లా శ్రీనివాస్,కాకటి భార్గవ్,రమేష్ చంద్రగుప్త,శివకుమార్ ఖండేల్ వాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags