రోడ్డు ప్రమాదంలో ఇరువురు యువకులకు తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం ఇల్లందులో జరిగింది. ఇల్లందు పట్టణానికి చెందిన ఇరువురు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో ఒక్కసారిగా ట్రాలీ రావడంతో బండి అదుపుతప్పి క్రింద పడ్డారు.దింతో ఇరువురు యువకులకు కాళ్ళు విరిగినట్లు తెలిసింది. కాగా యువకుల కుటుంబ సభ్యులు హుటాహుటిన ఖమ్మం వైద్యశాలకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
- 55 views