గద్వాల్: ప్రజాజ్యోతి ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జడ్పీ కార్యాలయం నందు అలంపూర్ టిఆర్ఎస్ యువజన నాయకులు ఆర్.కిషోర్ జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్యని మర్యాదగాపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, మిఠాయి తినిపించి కేక్ కటింగ్ చేయడం జరిగింది.
ఆయురారోగ్యాలతో,నిండు నూరేళ్ళు సంతోషంగా వుండాలని ఆశిస్తూ రాజకీయ జీవితంలో మీరు ఇంకా ఎన్నో పదవులు పొందాలని ఇలాగే ప్రజా జీవితంలో నిరంతరం కొనసాగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఆర్ కిషోర్ తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీనాథ్ రెడ్డి, బొంకూరు భరత్ రెడ్డి, ఆనంద్, వెంకట్ రాములు, చిన్న యాదవ్, మెడికల్ మధు, హుస్సేన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
- 8 views