వెంకటరెడ్డి మరణం గ్రామానికి తీరని లోటు.. కోదాడ మాజీ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి...

Submitted by shaikmohammadrafi on Sun, 25/09/2022 - 11:33
Venkata Reddy's death is a great loss for the village.   Kodada is a former legislator  Best Padmavati...

నడిగూడెం, సెప్టెంబర్ 24, ప్రజా జ్యోతి: మండలంలోని, రామా పురం లో   నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం మాజీ చైర్మన్ స్వర్గీయ బూతుకూరి పెద వెంకట రెడ్డి  సంతాప సభ  శనివారం  రామాపురం  గ్రామంలో కుటుంబం సభ్యులు నిర్యహించగా సంతాప సభ లో కోదాడ మాజీ శాసన సభ్యురాలు ఉత్తం పద్మావతి  పాల్గొని, ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంక రెడ్డి నీతి నిజాయితీగా నిబద్ధతకు మారుపేరుగా తన రాజకీయ జీవితం గడిపారని గ్రామాభివృద్ధికి  ఎంతో కృషి చేశారన్నారు. ఆయన మరణం గ్రామానికి తీరనిలోటని ఆయన మరణంతో గ్రామం ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం గ్రామాల ప్రతి ఒక్కరు పనిచేయాలని కోరారు. వారి కుటుంబానికి ఎప్పుడు అండగా  ఉంటామని తెలిపారు.ఈ  కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ నాయకులు  బూతుకూరి వెంకటరెడ్డి, గుండు శ్రీను, వేపూరి సుదీర్,పగడాల ప్రభాకర్ రెడ్డి, రామిని విజయవర్దన్ రెడ్డి,కత్తి విజయ్, కంంభంపాటి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.