పిరమిడ్ స్పిరిచువల్ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ

Submitted by veerareddy on Sat, 24/09/2022 - 14:18
Vegetarian rally organized by Pyramid Spiritual

కాటారం సెప్టెంబర్ 22 ప్రజా జ్యోతి:  మండల కేంద్రంలో శుక్రవారంనాడు  పిరమిడ్ స్పిరిచువల్  ఆద్వర్యంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. . ఈ సందర్భంగా పలువురు  మాట్లాడుతూ మానవుని మతం ప్రేమ మతం, జీవించు జీవించ నివ్వు అనే నినాదం తో పిరమిడ్ ద్యానులు ప్రచారం చేశారు. ధ్యానం వలన ఆరోగ్యం,మంచి ఆలోచనా విధానం,మానవుని బుద్ది కుశలత,తనకు తాను తెలుసుకునేలా చేస్తుంది అని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షుడు అనంతుల రమేష్ బాబు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ధ్యాన శాకాహార ప్రచారకులు అనిల్ కుమార్,కాటారం పిఎసిఎస్ చైర్మన్ చల్ల నారాయణరెడ్డి, కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య , మహాదేవపూర్ జెడ్పిటిసి గుడాల అరుణ, చింతకాని ఎంపిటిసి విజయ రెడ్డి, పిరమిడ్ సేవాదళ్ జిల్లా సెక్రెటరీ దారం నాగేష్ కుమార్ మహాముత్తారం ధ్యానుల గంధం రాజేష్ పుష్ప లత, భూపాలపల్లి, మహాదేవపూర్ సూరారం దామెరకుంట, దేవరాపల్లి తదితర గ్రామాలు,మండలాలలోని అనేకమంది పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.