మండల వ్యాప్తంగా పలు గ్రామాల్లో దళితుల వనభోజన ఆత్మీయ సమ్మేళనం

Submitted by veerareddy on Fri, 30/09/2022 - 11:12
 Vanabhojana is a spiritual gathering of Dalits in many villages across the Mandal

మునుగోడు సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): మునుగోడు మండల పరిధిలో పలు గ్రామాల్లో కొంపల్లి, చీకటిమామిడి, వెల్మకన్నె, చల్మెడ, గూడపూర్, సోలిపురం, జనస్తాన్పల్లి, పులిపలుపుల, కల్వలపల్లి, రావి గూడెం, గుండ్లూరి గూడెం,దళితుల   వనభోజన కార్యక్రమాలకు విచ్చేసిన ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్రావు మాట్లాడుతూ దళితుల బాంధవుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని దళితుల కోసం దళిత బంధు పథకం పెడితే దీన్ని బిజెపి పార్టీ వారు అనేక రకాలుగా దళితులను వ్యతిరేకిస్తూ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు,దళితుల వ్యతిరేక పార్టీ బిజెపి ని ఓడించమని ప్రజలకు పిలుపునిచ్చారు . గుజరాత్ , ఉత్తర ప్రదేశ్, పంజాబ్ లలో దళితులపై విచ్చలవిడిగా దాడులు చేస్తుంటే స్వరాష్ట్రమైన తెలంగాణలో దళితులు ఏకమై టిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో మునుగోడు మండల ఎంపీపీ కర్నాటి స్వామి, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మండల అధ్యక్షుడు బండా పురుషోత్తం రెడ్డి, బోయపర్తి సురేందర్, జీడిమెట్ల ధర్మయ్య, మరియు వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు,