అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

Submitted by Ramakrishna on Sat, 01/10/2022 - 11:54
 Uttam Kumar Reddy conducted special pujas to the goddess

హుజూర్ నగర్ సెప్టెంబర్ 30(ప్రజా జ్యోతి)../..హుజూర్ నగర్ పట్టణంలోని 18 వార్డు నందు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కుల మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవి నవరాత్రి ఉత్సవాలలో గురువారం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  జక్కుల మల్లయ్య యాదవ్ దంపతులు ఉత్తంకుమార్ రెడ్డికి శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో  ఆయురారోగ్యాలతో పండుగ దిగ్విజయంగా నిర్వహించుకోవాలని  ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.