నులిపురుగుల నిర్మూలన మాత్రలను సద్వినియోగం చేసుకోవాలి

Submitted by P.mahender on Fri, 16/09/2022 - 10:50
Use deworming pills


యాదాద్రి, సెప్టెంబర్ 15 (ప్రజా జ్యోతి). నులి పురుగుల నివారణ మాత్రలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి అన్నారు. గురువారం తుర్కపల్లి మండలం ములకలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జాతీయ నులిపురుగుల నివారణ కార్యక్రమం సందర్భంగా ఆమె పాల్గొన్నారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విద్యార్థులకు ఈ మాత్రలు వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి ,జిల్లా వైద్యాధికారి మల్లికార్జునరావు, ఎంపీపీ భూక్య సుశీల రవీందర్ నాయక్ ,సర్పంచ్ ఇమ్మడి మల్లప్ప, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, అంగడి వాడి టీచర్లు, ఆశా వర్కర్లు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు