హన్మకొండ, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి).../ కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృధి శాఖ, సహకార శాఖ సహాయ మంత్రి బి.ఎల్. వర్మ వరంగల్ పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 23, 24వ తేదీలలో హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు అని బిజెపి హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో వారి యొక్క పర్యటన విజయవంతం కొరకు జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ సమన్వయకర్తలను నియమించారు. మంత్రి జిల్లా పర్యటన సమన్వయకర్తగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి దేశినీ సదానందం గౌడ్, దళిత కార్యకర్త ఇంట్లో మంత్రి అల్పాహారం సమన్వయకర్తగా ఓబిసి మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాలబోజు శ్రీనివాస్, ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సందర్శన సమన్వయకర్తగా బిజెపి జిల్లా నాయకులు చందుపట్ల రాజీరెడ్డి, పత్రిక విలేకరుల సమావేశం సమన్వయకర్తగా బిజెపి జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి, వరంగల్ పార్లమెంట్ కోర్ కమిటీ సమావేశం సమన్వయకర్తగా బిజెపి వరంగల్ పార్లమెంట్ కన్వీనర్ తాళపల్లి కుమారస్వామి, వరంగల్ పార్లమెంట్ పరిధిలోనీ సోషల్ మీడియా మండల, డివిజన్, అసెంబ్లీ, జిల్లా కన్వీనర్లు, కోకన్వీనర్ల, ఆ పై స్థాయి సోషల్ మీడియా సమావేశం సమన్వయకర్తగా బిజెపి సోషల్ మీడియా జిల్లా ఇంఛార్జి అనిశెట్టి సిద్ధార్థ, కో కన్వీనర్ శ్రీరాంరెడ్డి,కార్యకర్త ఇంట్లో రాత్రి భోజనం సమన్వయకర్తగా బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు కందగట్ల సత్యనారాయణ, ఆలయ సందర్శన సమన్వయకర్తగా బిజెపి రాష్ట్ర నాయకులు రావుల కిషన్, 24వ తేదీ ఉదయం కార్యకర్త ఇంట్లో మంత్రి అల్పాహారం సమన్వయకర్తగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, మడికొండ టెక్స్ టైల్ పార్క్ సందర్శన సమన్వయకర్తగా బిజెపి జిల్లా నాయకులు పాశికంటి రాజేంద్రప్రసాద్, వర్ధన్నపేట నియోజకవర్గ కోకన్వినర్ తౌటిరెడ్డి రవీందర్ రెడ్డిలు వ్యవహరించనున్నట్లు తెలిపారు.
- 2 views