టిఆర్ఎస్ లో చేరిన గిరిజనులు

Submitted by veeresham siliveru on Thu, 08/09/2022 - 18:31
Tribals who joined TRS
  • టిఆర్ఎస్ లో చేరికలు

సంస్థాన్ నారాయణపురం సెప్టెంబర్ 8 ,ప్రజా జ్యోతి : సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ గుట్టలోని ఐదు దోమల తండా లో సిపిఐ కాంగ్రెస్ పార్టీ నుంచి 50 మంది గిరిజనులు గురువారం నాడు మాజీ ఎమ్మెల్యే కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు టిఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వానికి అండగా ఉంటే మరిన్ని సౌకర్యాలు గిరిజనులకు అందుతాయని సూచించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గుత్తా ప్రేమ్చందర్ రెడ్డి, భాస్కర్ చిలువేరు బిక్షం, తదితరులు పాల్గొన్నారు.