తెలంగాణ విమోచన దినోత్సవం స్ఫూర్తిదాయక దినోత్సవం

Submitted by mallesh on Wed, 14/09/2022 - 15:20
Telangana Liberation Day  Inspirational day

చౌటుప్పల్ సెప్టెంబర్ 13 ప్రజా జ్యోతి నిజం నిరంకుశ పాలన నుంచి తెలంగాణ కు విముక్తి కలిగించిన, సాయుధ పోరాట అమరవీరుల ఆశయ సాధన కోసం పోరాడాలని, బీజేవైఎం రాష్ట్ర స్టడీ సర్కిల్ కన్వీనర్ దిండు భాస్కర్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 13 నుండి 17 వరకు  నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని తంగడపల్లి నుంచి  నేషనల్ హైవే 9 మీదుగా లక్కారం వరకు సుమారు 200 మంది బీజేవైఎం కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర క్రీడ కన్వీనర్ ఆలే చిరంజీవి మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం ఒక స్ఫూర్తిదాయక దినోత్సవం అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరులను స్మరించుకుంటూ సెప్టెంబర్ 17 వ తేదీన సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో  నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమానికి బీజేవైఎం కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి దూడల బిక్షం గౌడ్ , శ్రీధర్ బాబు, బండమీది మల్లేశం, ఉబ్బు వెంకటయ్య, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి కొయ్యడ సైదులు గౌడ్, చింతకింది కిషోర్,  కృష్ణ కృష్ణ, జక్కిలి రాజు ,మానుక వెంకటరెడ్డి మునగాల రాజశేఖర్ రెడ్డి, పాలెం వెంకటేష్ విజయ్ రెడ్డి, పబ్బు వంశీ ,సంపతి సుధాకర్, భాస్కర్, శరత్, రాజ్ కమల్ ,నరేష్ , రవి, సామ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.