అచ్చంపేట సెప్టెంబర్ 26.ప్రజా జ్యోతి. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్ రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్ లు అన్నారు సోమవారం అచ్చంపేట పట్టణంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అదేవిధంగా పట్టణంలో 10 11 వార్డులో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఐడి కార్డులు పంపిణీ చేశారు దీంతోపాటు పట్టణంలో బతుకమ్మ చీరలను చైర్మన్ నరసింహ గౌడ్ మనోహర్ చేతుల మీదుగా మహిళలకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాట యోధురాలని ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు ప్రభుత్వ అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలందరూ సభ్యునిగా చేసుకోవాలని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలరాం నాయక్ కౌన్సిలర్లు సుంకరి నిర్మల శివ సోమల నాయక్ సునీత సంధ్య రమేష్ గౌరీ శంకర్ టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు రమేష్ నాయకులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.ఫోటో రైట్ అప్
ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులు.
- 1 view