పాలక వీడు,సెప్టెంబర్21(ప్రజా జ్యోతి): పాలకీడు మండలం బొత్తల పాలెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలని తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా మండల నోడల్ అధికారి బాలు సందర్శించారు. పాఠశాలలో బోధనా విధానం అమలవుతున్న తీరును , తరగతి గదులవారీగా పరిశీలించారు. విద్యార్థుల స్థాయి, వారు పాఠ్యాంశాలని అర్థం చేసుకుంటున్న స్థితిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు పూల్ సింగ్, నాగార్జునతో పాటు ప్రధానోపాధ్యాయుడు రెడ్డిపల్లి శ్రీనివాస్, ఉపాధ్యాయులు ధర్మరాజు, మక్త నాయక్, యూసుఫ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
- 2 views