ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్ర కుమార్, చిరుమర్తి లింగయ్య
నాంపల్లి సెప్టెంబర్28 (ప్రజాజ్యోతి ): మండలంలో పలు గ్రామాలైన స్వాములవారి లింగోటం, వడ్డేపల్లి ,చిట్టెంపహాడ్ నెవెళ్లగూడెం, దామెర ,నేర్లపల్లి ,పెద్దాపురం, టి పి గౌరారం ,తుంగపాడు గ్రామాలలో దళితవాడలో నిర్వహించిన దళిత కుటుంబాల ఆత్మీయ సమ్మేళన, వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవరకొండ శాసనసభ్యులు మరియు నల్లగొండ తెరాస పార్టీ అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం దళితులకు అన్నిట్లో పెద్దపీఠ వేస్తుందని కళ్యాణ లక్ష్మి పథకం కూడా మొదటగా దళితులకే ప్రారంభించారు. దళితులు వెనుకబడి పోకూడదని దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల సహాయం ప్రభుత్వం అందిస్తుందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు. మునుగోడు నియోజకవర్గంలో త్వరలో 1500 మంది లబ్ధిదారులకు దళిత బంధు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి ,స్థానిక జడ్పిటిసి ఎలుగొటీ వెంకటేశ్వర్ రెడ్డి, మండల తెరాస అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు, మాల్ మార్కెట్ డైరెక్టర్ కడారి శ్రీశైలం యాదవ్, ఏడుదొడ్ల ప్రభాకర్ రెడ్డి మరియు పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు .
- 4 views