జిల్లాలో పాదయాత్ర రూట్ మ్యాప్ ని షర్మిలకి ఇచ్చిన అప్పం కిషన్.
భూపాలపల్లి టౌన్ సెప్టెంబర్16 ప్రజాజ్యోతి// .జిల్లాలో పార్టీని బలోపేతం చేసుకుంటూ, ప్రజాసమస్యలపై దృష్టి సారించాలని వైఎస్ షర్మిల భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు అప్పం కిషన్ కు సూచించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రారంభించిన ప్రజాప్రస్థానం పాదయాత్ర మహబూబ్ నగర్ జిల్లాకి చేరుకోవడం జరిగింది జిల్లా కేంద్రంలో జరుగుతున్న పాదయాత్రలో భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు అప్పం కిషన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ షర్మిల చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రజల పక్షాన మాట్లాడే రాజకీయ పార్టీలు లేవని ప్రతిపక్ష పార్టీలు కేసీఆర్ గుప్పెట్లో ఉన్నాయని కేవలం షర్మిల మాత్రమే ప్రజల పక్షాన మాట్లాడుతుందని ప్రజలు పడుతున్న సమస్యలను బహిరంగ సభల ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి అందజేస్తుందని ప్రజలు కాంగ్రెస్ బిజెపి తెరాస,కమ్యూనిస్టులను నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు .
భూపాలపల్లి జిల్లాలో పాదయాత్రకు సంబంధించి పూర్తి సమాచారంతో రూట్ మ్యాప్ ని షర్మిలకి ఇవ్వడం జరిగిందనీ భూపాలపల్లి జిల్లాలో పార్టీ పరిస్థితులపై జిల్లా కమిటీలపై జిల్లాలో పాదయాత్ర ప్రారంభం అయ్యేవరకు పూర్తిస్థాయి కమిటీలు పూర్తి చేయాలని వైఎస్ షర్మిల చెప్పారనీ కిషన్ తెలియజేశారు. భూపాలపల్లి జిల్లాలో పరిష్కారం కానీ సమస్యలు ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని, భూపాలపల్లి జర్నలిస్టుల ఇండ్ల పట్టాల సమస్యనీ షర్మిల అడిగి తెలుసుకున్నారని కిషన్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజేందర్ రవీందర్ సంపత్ సురేందర్ వెంకటేష్ రాజలింగం నరేందర్ సతీష్ పాల్గొన్నారు.
- 1 view