సర్పంచ్ ని సన్మానించిన ఉపాధి హామీ సిబ్బంది

Submitted by Yellaia kondag… on Mon, 19/09/2022 - 16:35
Sarpanch Honored Employment Guarantee Staff


తుంగతుర్తి సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి..../ గత వారంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో జరిగిన  జాతీయస్థాయి స్మార్ట్ విలేజి సెమినార్ కు హాజరై తిరిగి వచ్చిన మండల పరిధిలోని గానుబండ గ్రామ సర్పంచ్ , మండల సర్పంచ్ లా ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి నీ తన నివాసంలో సోమవారం ఉపాధి హామీ సిబ్బంది శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నల్లు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూగ్రామపంచాయతీల నిర్వహణ, గ్రామాలలో చేపట్టవలసిన అభివృద్ధి తదితర అంశాలపై సెమినార్ లో చర్చించడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సహకారంతో గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల వల్లనే తనను ఈ సెమినార్ కు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ముందు ముందు కూడా గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచి జాతీయ స్థాయిలోనే  ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేష్, గ్రామ కార్యదర్శి బరపటి కృష్ణ, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ బిక్షం, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్ తోపాటు టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.