తుంగతుర్తి సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి..../ గత వారంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో లో జరిగిన జాతీయస్థాయి స్మార్ట్ విలేజి సెమినార్ కు హాజరై తిరిగి వచ్చిన మండల పరిధిలోని గానుబండ గ్రామ సర్పంచ్ , మండల సర్పంచ్ లా ఫోరం అధ్యక్షులు నల్లు రామచంద్రారెడ్డి నీ తన నివాసంలో సోమవారం ఉపాధి హామీ సిబ్బంది శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నల్లు రామచంద్ర రెడ్డి మాట్లాడుతూగ్రామపంచాయతీల నిర్వహణ, గ్రామాలలో చేపట్టవలసిన అభివృద్ధి తదితర అంశాలపై సెమినార్ లో చర్చించడం జరిగిందన్నారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సహకారంతో గ్రామంలో చేసిన అభివృద్ధి పనుల వల్లనే తనను ఈ సెమినార్ కు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ముందు ముందు కూడా గ్రామాన్ని మరింత అభివృద్ధి పరిచి జాతీయ స్థాయిలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సురేష్, గ్రామ కార్యదర్శి బరపటి కృష్ణ, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ బిక్షం, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్ తోపాటు టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
- హోమ్
-
తెలంగాణ
- భువనగిరి
- వాజేడు
- జనగావ్
- నారాయణ్ పేట్
- పెద్దపల్లి జిల్లా
- అదిలాబాద్
- ఆసిఫాబాద్
- భద్రాద్రి
- భద్రాద్రి కొత్తగూడెం
- హైదరాబాద్
- జగిత్యాల్
- జనగావ్
- జయశంకర్ భూపాలపల్లి
- జోగులాంబ గద్వాల్
- కామా రెడ్డి
- కరీంనగర్
- కరీంనగర్
- కొమరం భీమ్
- మహబూబాబాద్
- మహబూబ్ నగర్
- మంచిర్యాల్
- మెదక్
- మేడ్చల్
- నాగర్ కర్నూల్
-
నల్గొండ
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- సూర్యాపేట్
- రాజన్న సిరిసిల్ల
- రంగారెడ్డి
- సంగారెడ్డి
- సిద్ధిపేట్
- వికారాబాద్
- వనపర్తి
- వరంగల్
- వరంగల్ రూరల్
- వరంగల్ అర్బన్
- యాదాద్రి భువనగిరి
- వార్తలు
- రాజకీయాలు
- సినిమా
- జాతీయ వార్తలు
- గ్యాలరీలు
- వీడియోలు
- ఆంధ్రప్రదేశ్