తొలి మెట్టు ద్వారా విద్యా ప్రమాణాల పెంపు

Submitted by Degala shankar on Sat, 24/09/2022 - 13:10
Raising the standard of education through the first step

రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ

ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 23, (ప్రజా జ్యోతి) విద్యార్థులు విద్యాభివృద్ధికి తొలిమెట్టు కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని, విద్యా ప్రమాణాల మెరుగుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ అన్నారు. గురువారం రాత్రి కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి, జిల్లా కలెక్టర్ తో కలిసి తొలిమెట్టు, మన ఊరు-  మనబడి కార్యక్రమాలు జిల్లాలో అమలు తీరుపై విద్యాశాఖ అధికారులు, సిబ్బంది, పాఠశాల మేనేజ్మెంట్ చైర్మన్ లతో సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ కార్యదర్శి మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులు నాణ్యతతో మనస్ఫూర్తిగా విద్యా బోధన చేపట్టాలని, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధనా చేయడం ద్వారా విద్యార్థుల్లో పఠణ సామర్థ్యం పెరుగుతుందని అన్నారు. బాధ్యతాయుతంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను అభినందించడం జరుగు తుందని ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలను నిర్వ హించడం జరిగిందని తెలిపారు. మంచి ఆలోచనలతో విద్యా శాఖను ఉన్నత స్థాయికి తీసుకురావాలని ఆకాంక్షించారు. పాఠశాలలను పర్యవేక్షించి, మౌలిక సదుపాయాలు, విద్యా బోధన, విద్యార్థుల పఠణ సామర్ధ్యం లను నోడల్ అధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. మన ఊరు మనబడి కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, అక్టోబర్ మాసంలో మోడల్ స్కూల్ ప్రారంభానికి సిద్ధం చేయాలని అన్నారు. జిల్లాలో మన ఊరు మనబడి పనులపై స్పందిస్తూ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా పనులు చేయడం జరుగుతున్నదని, పెయింటింగ్ కు ముందు పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు.

చేపట్టిన పనులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ లలో అప్లోడ్ చేయాలని అన్నారు. పనులకు సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో వివరించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమం కింద మొదటి దశలో 237 పాఠశాలల్లో పనులు చేపట్టడం జరుగుతుందని, ఇందులో 214 గ్రామీణ, 23 పట్టణ ప్రాంతాలలోని పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు. 30 లక్షలకు పైగా 34 పాఠశాలలు, 30 లక్షల లోపు 203 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని తెలిపారు.  స్థానిక పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలు, ప్రజాప్రతినిధుల సహకారంతో అక్టోబర్ మాసం నాటికి పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో తొలిమెట్టు కార్యక్రమం కింద ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించి, విద్యార్థుల పఠణ సామర్థ్యాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించి తొలిమెట్టు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరిత, జైంట్ డైరెక్టర్ వెంకట నర్సమ్మ, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ రమేష్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాష, జిల్లా విద్యాశాఖ అధికారిని ప్రణీత, పంచాయితీరాజ్ ఈ ఈ మహావీర్, ఇంజనీరింగ్, సెక్టోరల్ అధికారులు, పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ లు, ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.