- అధికారులను ఆదేశించిన కలెక్టర్ శశాంక
మహబూబాబాద్ బ్యూరో సెప్టెంబర్ 14 (ప్రజా జ్యోతి): ఈ నెల 16, 17, 18 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లాలో వజ్రోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్ వివరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రెండు నియోజకవర్గ కేంద్రాలలో ఈ నెల 16న ర్యాలీ నిర్వహణకు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగిందని నియోజకవర్గ స్థాయిలో ఆర్డీవో డిఎస్పి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్లను బాధ్యులుగా నియమించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ర్యాలీ అనంతరం భోజన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని, అదేవిధంగా 17వ తేదీన హైదరాబాదులో జరిగే కార్యక్రమానికి జిల్లా నుండి గిరిజన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, స్వయం సహాయక బృందాలు, పాల్గొనేందుకు గాను అవసరమైన బస్సులను ఏర్పాటు చేసి, లైసెన్ అధికారులను ప్రతి బస్సుకి కేటాయించడం జరిగిందని కలెక్