- సిసి ఫుటేజీలను పరిశీలిస్తున్న బ్యాంకు అధికారులు పోలీసులు
తాండూరు అక్టోబర్ 3 ప్రజా జ్యోతి :- తాండూరు పట్టణానికి చెందిన గిరిబాబు అనే వ్యక్తి తన ఖాతాలో నుంచి విత్ డ్రా చేసుకున్న డబ్బులు రూ 20 వేలు కాగ అందులోని రూ 12,500 రూపాయలు తన జేబులో పెట్టుకున్నాడు. మిగతా రూ 7వేల 500 రూపాయలు టేబుల్ పై పెట్టి లెక్కిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి మాయ మాటలతో మోసగించి అపహరించుకుపోయినట్లు బాధితుడు తెలియజేశాడు .ఇట్టి విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు తాండూరు పట్టణం సౌకార్ పేటలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( మేయిన్ బ్రాంచ్) వద్దకు చేరుకొని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- 11 views