మునుగోడు సెప్టెంబర్ 29 (ప్రజా జ్యోతి): మునుగోడు మండల కేంద్రంలోని జై మహాభారత్ పార్టీ వ్యవస్థాపక జాతీయఅధ్యక్షులు భగవాన్ శ్రీ అనంత విష్ణు( ప్రభు) గురువారం రోజు 12 రథాలను ప్రారంభించారు మిగతా 100రధాలను నియోజకవర్గ స్థాయిలో త్వరలో ప్రారంభించనున్నారు.ప్రచార రథాలను పార్టీ జెండా ఊపి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో సామాజిక అసమానతలు మరియు పేదరిక నిర్మూలన కోసం, ప్రచారం చేయడమే జై మహాభారత్ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రుక్మిణి బాయ్, లలితా బాయ్ స్వరూప శ్రీనివాస్ మరియు ఆర్గనైజర్ రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గ నాయకులు జంగయ్య తదితరులు పాల్గొన్నారు.
- 9 views