మున్సిపల్ చైర్మన్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం
చిట్యాల సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి).///... నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల పట్టణంలోని కనకదుర్గ అమ్మవారి దేవస్థానం లో దసరా శరన్నవరాత్రి ఉత్సవములు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.మొదటిరోజు అమ్మవారిని స్వర్ణకవచ దుర్గాదేవిగా అలంకరించారు.నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ఆచార్యత్వంలో గణపతి పూజ, కలశ స్థాపన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో వయసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
- 2 views