హలియా,సెప్టెంబర్26(ప్రజా జ్యోతి): అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు లో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.పెద్దవూర మండల పరిధిలోని లింగంపల్లి, పెద్దగూడెం,శిరసనగండ్ల గ్రామాలలో సీసీ రోడ్ల పనులకు ఆయన సోమవారం శంకుస్థాపన చేసి మాట్లాడారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో కూడా లేవన్నారు.అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. అనంతరం అయా గ్రామాలలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.చీరల పంపిణీ కార్యక్రమం అనంతరం వ్విమహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేసిండన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్ధులు,పిఎసిఎస్ చైర్మన్ గుంటుక వెంకట్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రవి నాయక్, కో ఆప్షన్ మెంబర్ షేక్ బషీర్, గజ్జెల లింగారెడ్డి,ఆయా గ్రామాల సర్పంచులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
- 1 view