సెప్టెంబర్ 24 ప్రజాజ్యోతి. కాళేశ్వరం లో ని అంతరాష్ట్ర వంతెన వద్ద అక్రమంగా తరలిస్తున్న గంజాయిని కాళేశ్వరం పోలీసులు పట్టుకున్నారు. కాళేశ్వరం ఎస్ ఐ నరేష్ ఆధ్వర్యంలో వంతెన వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా సిరోంచ నుండి కాళేశ్వరం వస్తున్నా బజాజ్ ఆటో టీ ఎస్ 19టీ ఏ 4888 నంబర్ గల ఆటోను ఆపి తనిఖీ చేయగా అందులో 4 వందల గ్రాముల గంజాయి లభ్యమైందని పోలీసులు తెలిపారు. మంచిర్యాల జిల్లాజైపూర్ కు చెందిన ఇద్దరు మహారాష్ట్ర నుండి కాళేశ్వరంకు గంజాయిని తరలిస్తున్నారని తెలిపారు. యువకులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వాహన తనిఖీల్లో కాళేశ్వరం ఎస్ ఐ లు లక్ష్మణ్రావు, నరేష్ ల తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
- 2 views