జాతీయ పోషణ అభియాన్ మహోత్సవాలు

Submitted by Sukka.ganesh on Tue, 13/09/2022 - 10:26
National Nutrition Abhiyan celebrations

యాదాద్రి(వలిగొండ)సెప్టెంబర్ 12 ప్రజాజ్యోతి ; న్యూస్:అభియాన్ పోషణ మహోత్సవాలలో భాగంగా సోమవారం ఐసిడిఎస్ రామన్నపేట వారి ఆధ్వర్యంలో వలిగొండ మండలంలోని లోతుకుంట గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో స్థానిక వైద్య అధికారి డాక్టర్ జ్యోతి పర్యవేక్షణలో కిషోర బాలికలకు రక్తహీనత పరీక్షలు నిర్వహించడం జరిగింది.

జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమ ప్రాముఖ్యతను గురించి వివరిస్తూ బాలికల శారీరక మానసిక ఎదుగుదలకు అవసరమయ్యే పోషకాల ప్రాధాన్యత గురించి రోజువారీగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాల గురించి కిషోర బాలికలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు ధనలక్ష్మి  వలిగొండ సెక్టార్,వాణిశ్రీ వెల్వర్తి సెక్టార్,అంగన్వాడి టీచర్ రాచకొండ విజయ,హెచ్ ఇ ఓ  రమేష్,ఏఎన్ఎం కె శోభారాణి,మరియమ్మ హెల్త్ సూపర్వైజర్,సంతోష ఆశావర్కర్,ఎల్ టి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.