ఎంపి దయాకర్ కు కృతజ్ఞతలు తెలిసిన ఎంఆర్పీఎస్ నాయకులు

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 11:54
MRPS leaders know thanks to MP Dayakar

హనుమకొండ, సెప్టెంబర్21 (ప్రజాజ్యోతి) .../ హైదరాబాద్ లో నిర్మించిన నూతన సచీవాలయానికి అంబేద్కర్ భవన్ అని నామకరణం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ధన్యవాదాలు తెలియజేస్తు మాదిగ రాజకీయ పోరాటాసమితి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ల్యాదేళ్ల కుమార్వ మాదిగ ఆధ్వర్యంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ ను తన నివాసంలో కలిసి పూలగుచ్చంతో కృతజ్ఞతలు తెలిపారు. ఎంపిని  కలిసిన వారిలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొక్కల వెంకటస్వామి, రాష్ట్ర ప్రధానకార్యధర్శి గన్నారపు రవి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు సింగారపు చిరంజీవీ, హన్మకొండ జిల్లా ప్రదాన కార్యదర్శి జేరిపోతుల విల్సన్, కాజిపేట్ మండల అధ్యక్షులు శనిగారపు లింగస్యామి తదితరులు ఉన్నారు.