గద్వాల ప్రతినిది(ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 10 : శనివారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి చిత్రపటానికి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగినది.
తెలంగాణ మహిళల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ గారు అని కొనియాడారు.చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్, ఎంపీపీ విజయ్, జిల్లా గ్రంధాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ్, జమ్ములమ్మ ఆలయ కమిటీ చైర్మన్ సతీష్, కౌన్సిలర్ నరహరి గౌడ్, తెరాస పార్టీ నాయకులు రమేష్ నాయుడు, వైన్డింగ్ రాములు , కురుమన్న, రిజ్వాన్, భగీరథ వంశీ, ధర్మ నాయుడు, రాజారెడ్డి, తిమ్మప్ప, గట్టు రాముడు, సిద్దు, నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.