భూపాలపల్లి టౌన్ సెప్టెంబర్21 ప్రజాజ్యోతి : భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు సెగ్గంపల్లిలో రూ.7.80 లక్షలతో నిర్మించిన అంగన్వాడి భవనాన్ని, 17వ వార్డు సుభాష్ కాలనీలో రూ.1.10కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ బాలికల సంరక్షణ భవన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిధిగా పాల్గొని భూపాలపల్లి శాసన సభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ దివాకర, ఐటిడీఎ పీఒ అంకిత్, మున్సిపల్ చైర్మన్ సెగ్గం వెంకటరాణి, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీష్ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్, జడ్పీ వైస్ చైర్మన్ కల్లెపు శోభ, ఎంపీపి మందల లావణ్య, పీఎసీఎస్ చైర్మన్ మేకల సంపత్ యాదవ్, టీఆర్ఎస్ పార్టి పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్, సీనియర్ నాయకులు, యూత్ అధ్యక్షుడు బుర్ర రాజు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- 1 view