జోనల్ స్థాయి కబడ్డీ ఆటల పోటీలలో మఠంపల్లి గురుకుల బాలికల హావ

Submitted by Ramakrishna on Fri, 30/09/2022 - 10:07
Mathampally Gurukula Girls Hawa in Zonal Level Kabaddi Games Competitions

హుజూర్ నగర్ సెప్టెంబర్ 29(ప్రజా జ్యోతి)./..గురుకుల సోషల్ వెల్ఫేర్ ఎనిమిదవ జోనల్ స్థాయి ఆటల పోటీల్లో మఠంపల్లి గురుకుల బాలికలలు సత్తా చాటారు. కబడ్డీ,రన్నింగ్, షార్ట్ పుట్, 200 మీటర్ల లలో ప్రథమ, ద్వితీయ స్థలాలను కైవసం చేసుకున్నారు.కబడ్డీ ప్రథమ స్థానం,200 మీటర్ల పరుగు పందెం14 సంవత్సరాల బాలిక  ఎస్.సిరి ద్వితీయ స్థానం, షార్ట్ పుట్లో 14 సంవత్సరాల బాలిక బి.నవ్య ప్రథమ బహుమతి, 800 మీటర్ల పరుగు పందెంలో భవాని , డిస్కస్ త్రో బి. నవ్య, క్యారమ్ .దీపిక, వినీల, లు మొదటి బహుమతి, చెస్ శ్రీ ప్రవలిక ద్వితీయ బహుమతు లను సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ మంజుల మాట్లాడుతూ నాలుగు జిల్లాల గురుకులాల విద్యార్థినులు ఈ పోటీలలో పాల్గొనగా మఠంపల్లి గురుకులాల విద్యార్థులు మొదటి బహుమతి సాధించడం సంతోషకరమని మూడు రోజులపాటు జరిగిన క్రీడలలో 1500 మదికి పైగా విద్యార్థులు  పాల్గొనడం విశేషం అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు జయ,ఉషారాణి,ఉపాధ్యాయిని,ఉపాధ్యాయలు పాల్గొన్నారు.