అంత్యక్రియల కోసం ఆర్థిక సహాయం చేసిన పలుహురు నేతలు

Submitted by P.mahender on Wed, 14/09/2022 - 14:54
Many leaders have provided financial support for the funeral.

యాదాద్రిజిల్లా(ప్రజాజ్యోతి): ; యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిధిలోని దత్తాయిపల్లి గ్రామానికి చెందిన గుర్రాల మల్లయ్య అకస్మాత్తుగా మరణించారు.ఇటీవల కాలం లో మల్లయ్య 2 వ కుమారుడు ఏమిలేష్ చనిపోవడం తో వారి కుటుంబ పరిస్థితిని తెలుసుకొని అంత్యక్రియల కోసం గ్రామ సర్పంచ్ వెన్న కూచి రామ్మోహన్ శర్మ 5000 రూపాయల ఆర్థిక సాయం,అలాగే బిజెపి రాష్ట్ర నాయకుడు పడాల శ్రీనివాస్ 5000 రూపాయలను ఆర్థిక సహాయం చేశారు.ఈ కార్యక్రమంలో ఎరుకల స్వామి గౌడ్, పాల నరేష్, ధ్యానబోయిన వెంకటేష్, బాల కృష్ణ, ప్రవీణ్,గాదె ప్రవీణ్, కృష్ణ, కొండల్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు