కల్వకుర్తి సెప్టెంబర్ 10(ప్రజా జ్యోతి) ఏఐసిసి కార్యదర్శి,కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి ఆదేశాల మేరకు యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడిగా పోతేపల్లి గ్రామానికి చెందిన తగుళ్ళ కొండల్ యాదవ్ ను నియమిస్తూ శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోతిలాల్ నాయక్,కొండల్ యాదవ్ కు నియామక ఉత్తర్వులను అందజేశారు.
ఈ సందర్భంగా కొండల్ యాదవ్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో యువజన కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడిగా అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ యువజన కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ నాయకులకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ మట్ట వెంకటయ్య, తాలుకా కిసాన్ సెల్ అధ్యక్షుడు పర్వత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మధుసూధన్ రెడ్డి,యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తక్కళ్ళపల్లి శేఖర్,మండల అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు పుల్లయ్య,నాయకులు ఎర్ర శ్రీను,జైరాం నాయక్,తిరుపతి రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
- 7 views