నాంపల్లి, సెప్టెంబర్ 28(ప్రజాజ్యోతి ): ఆడబిడ్డలకు పెద్దన్నగా అండగా కెసీఆర్ దసరా పండుగ పూట కొత్త బట్టలతో సంతోషంగా ఉండాలని బతుకమ్మ చీరలను అందజేస్తున్నట్లు జడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి అన్నారు. బుధవారం నాడు నాంపల్లి మండలం తిరుమలగిరి, పసునూరు గ్రామాలలో ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.విరితో పాటు మండల ఎంపీడీవో రాజు నాయక్ టీఆర్ఎస్ నాయకులు శీలం జగన్మోహన్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే అబ్బాస్,పార్టీ కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- 1 view