ర్యాలీ ఏర్పాట్ల పరిశీలన

Submitted by veerareddy on Fri, 16/09/2022 - 12:37
 Inspection of rally arrangements

భూపాలపల్లి ప్రతినిధి , సెప్టెంబర్15తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకొని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ నెల 16న నిర్వహించే భారీ ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని స్థానిక ఎంఎల్ఏ గండ్ర వెంకటరమణ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా  పిలుపునిచ్చారు. 16 వ తేదీన ర్యాలీ మొదలయ్యే ప్రదేశ్హాలను (న్యూ మార్కెట్ , ఓల్డ్ మార్కెట్ మరియు జయశంకర్ చౌరస్తా )ల  నుండి  అంబేడ్కర్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.  జరిగే భోజన ఏర్పాట్లను అధికారుల లతో కలిసి కలెక్టర్ పర్యవేక్షించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 15 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని, ప్రభుత్వ ఆదేశాలతో ర్యాలీలో 10వేల జాతీయ పతాకాలతో జాతీయ భావం  పెంపొందే దిశగా ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ర్యాలీ అనంతరం అంబేడ్కర్ స్టేడియం నిర్వహించే భోజన  కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. భోజన సమయంలో ఎలాంటి ఇబ్బంది కల్గకుండా అధిక సంఖ్యలో కౌంటర్లు ఏర్పాటు చేయాలని, కౌంటర్ వద్ద ఒక అధికారికి బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

ఈనెల 16 నుండి 18 వరకు నిర్వహించే తెలంగాణ జాతీయ సమైక్య వజ్రోత్సవ కార్యక్రమాలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.