తాళ్లపల్లి వాగులో యువకుడు గల్లంతు సంఘటనా స్థలానికి చేరుకున్న జడ్పీ చైర్ పర్సన్

Submitted by veerareddy on Sat, 01/10/2022 - 13:09
Youth Gallanthu in Tallapalli vagu was the chairperson of ZDP who reached the scene

తెలకపల్లి,సెప్టెంబర్ 30 (ప్రజాజ్యోతి):   తెలకపల్లి మండలం తాళ్లపల్లి గ్రామం వద్ద వాగులో శుక్రవారం గ్రామానికి చెందిన యువకుడు మామిళ్ళపల్లి రాఘవేందర్ గల్లంతయాడు ఉదయం పొలానికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో విషయం తెలిసిన జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి బంగారయ్య ఎంపీపీ కొమ్ము మధు ఆర్డిఓ నాగలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ పద్మావతి మాట్లాడుతూ రెస్కి టీమ్స్ ప్రయత్నాలు కొనసాగించాలని అవసరమైతే ఫిషరీస్ సహాయం తీసుకోమని అధికారులను ఆదేశించారు గల్లంతైన రాఘవేందర్ కోసం రిస్కీ టీమ్స్ ఎస్సై ప్రదీప్ కుమార్ ఉప తహసిల్దార్ లక్ష్మణ్ నాయక్ తదితరులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.